నిజంనిప్పులాంటిది

May 01 2024, 20:27

లోక్ సభ ఎన్నికలు 2024 హైదరాబాద్ లోక్ సభ స్థాన చరిత్ర

ఒవైసీ అలాగే ఉంటాడా లేదా హైదరాబాద్ "నిజాం" మారతాడా, ఈ సీటు రాజకీయ చరిత్ర తెలుసుకోండి

నిజాం నగరం హైదరాబాద్

ముత్యాలకు ప్రసిద్ధి

1984 నుండి AIMIM బలమైన కోట

40 ఏళ్లుగా ఒవైసీ కుటుంబం ఆధీనంలో ఉంది

మొత్తం 17 ఎన్నికల్లో ఒవైసీ కుటుంబం పదిసార్లు గెలిచింది

తండ్రి 6 సార్లు, కొడుకు 4 సార్లు ఎంపీ అయ్యారు

ఈసారి “నిజాముల కోట” బద్దలవుతుందా

దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నప్పుడు హైదరాబాద్‌ సీటు ప్రస్తావనకు ప్రాధాన్యం ఏర్పడుతుంది. చారిత్రాత్మకంగా ఈ నగరం చాలా ముఖ్యమైనది మరియు రాజకీయంగా కూడా దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. హైదరాబాద్‌ను నిజాంలు మరియు ముత్యాల నగరం అని కూడా పిలుస్తారు. భారతదేశంలోని అత్యంత అభివృద్ధి చెందిన నగరాలలో ఇది ఒకటి. తెలంగాణలోని హైదరాబాద్ లోక్‌సభ స్థానం బీఆర్‌ఎస్ అంటే భారత రాష్ట్ర సమితి, కాంగ్రెస్ లేదా బీజేపీ తప్పు చేయని స్థానం. ఇక్కడ మాత్రమే మరియు AIMIM యొక్క నాణెం మాత్రమే అంటే ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ మాత్రమే నడుస్తుంది.

స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి హైదరాబాద్‌లో జరిగిన మొత్తం 17 లోక్‌సభ ఎన్నికల్లో ఒవైసీ కుటుంబం పదిసార్లు విజయం సాధించింది. ఇతరులకు ఏడుసార్లు మాత్రమే అవకాశం వచ్చింది. కాంగ్రెస్ చివరి విజయం 1980లో. 1984లో అసదుద్దీన్ తండ్రి సలావుద్దీన్ ఒవైసీ తొలిసారిగా కాంగ్రెస్ విజయ పరంపరకు బ్రేక్ వేశారు. ఆ తర్వాత ఏ పార్టీ కూడా దీనిపై ఆసక్తి చూపలేదు. సలావుద్దీన్ వరుసగా ఆరు ఎన్నికల్లో గెలుపొందగా, అసదుద్దీన్ నాలుగు ఎన్నికల్లో విజయం సాధించారు.

హైదరాబాద్ లోక్ సభ స్థానం చరిత్ర

1952లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో హైదరాబాద్ లోక్‌సభ స్థానానికి తొలిసారిగా ఓటింగ్ జరిగింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అహ్మద్ మొహియుద్దీన్ విజయం సాధించారు. కానీ 1957 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ తన అభ్యర్థిని మార్చింది. వినాయక్‌రావు కోరట్కర్‌ను కాంగ్రెస్‌ రంగంలోకి దించగా ఆయన విజయం సాధించారు.

1962లో జరిగిన సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు చెందిన గోపాలయ్య సుబ్బుకృష్ణ మెల్కోటే విజయం సాధించారు. 1971 సాధారణ ఎన్నికల్లో మెల్కోటే ఎంపీగా కూడా ఎన్నికయ్యారు. అయితే ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బదులు తెలంగాణ ప్రజాసమితి టికెట్‌పై మెల్కోటే పోటీ చేశారు.

1977లో జరిగిన సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు చెందిన కేఎస్‌ నారాయణ్‌ విజయం సాధించారు. 1980 సాధారణ ఎన్నికలలో, కెఎస్ నారాయణ్ మళ్లీ కాంగ్రెస్ (ఐ) టిక్కెట్‌పై ఎంపీగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి హైదరాబాద్ లోక్‌సభ స్థానం నుంచి ఒవైసీ కుటుంబం వరుసగా గెలుస్తూ వస్తోంది.

గత 40 ఏళ్లుగా ఒవైసీ కుటుంబం వృత్తి

హైదరాబాద్ లోక్‌సభ స్థానం గత 40 ఏళ్లుగా ఒవైసీ కుటుంబం ఆధీనంలో ఉంది. ఈ కుటుంబానికి చెందిన ఒకరు 1984లో తొలిసారిగా హైదరాబాద్ లోక్‌సభ స్థానం నుంచి గెలుపొందారు. అసదుద్దీన్ ఒవైసీ తండ్రి సలావుద్దీన్ ఒవైసీ ఈ విజయం సాధించారు. అప్పటి నుంచి వరుసగా 6 సార్లు ఈ సీటును గెలుచుకున్నారు. సలావుద్దీన్ ఒవైసీ 1984, 1989, 1991, 1998 మరియు 1999 సంవత్సరాల్లో ఎంపీగా ఎన్నికయ్యారు. దీని తరువాత, అతని కుమారుడు మరియు ప్రస్తుతం AIMIM అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ ఈ స్థానం నుండి వరుసగా 4 సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. ఒవైసీ 2009లో తొలిసారిగా హైదరాబాద్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి 2009, 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఒవైసీ ఎంపీగా ఎన్నికయ్యారు.

ఒవైసీ ఐదోసారి విజయాన్ని నమోదు చేస్తారా?

2024లో కూడా ఒవైసీ తనదైన ముద్ర వేస్తున్నాడు. ఈసారి కూడా ఫలితం మారకుంటే అది వారికి వరుసగా ఐదో విజయం అవుతుంది. గత రెండు ఎన్నికల్లో భాజపా గట్టిపోటీనిచ్చినా ఓటమిని తగ్గించుకోలేకపోయింది. ఈసారి మాధవి ఆశతో లాంచ్ అయింది. ముఖం కొత్తదే అయినా గుర్తింపు పాతది. మాధవి ప్రముఖ హిందూ నాయకురాలిగా ఉండడంతో పాటు సామాజిక కార్యకర్తగా కూడా గుర్తింపు పొందారు. ఆవుల కొట్టం నడుపుతున్నాడు. మురికివాడల్లోని ముస్లిం మహిళల సుఖదుఃఖాలకు ఆమె అండగా నిలుస్తున్నారు. ఆర్థిక సహాయం అందజేస్తుంది. ఆమె సనాతన్ యొక్క బలమైన వక్త. ఆరోగ్య రంగంలో కూడా చురుకుగా ఉన్నారు.

నిజంనిప్పులాంటిది

Apr 30 2024, 11:35

తెలంగాణ టెన్త్ ఫ‌లితాలు విడుద‌ల‌.. బాలిక‌ల‌దే పైచేయి…

తెలంగాణలో ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ ఫ‌లితాలు ఈ రోజు విడుద‌ల‌య్యాయి.

రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య‌ కార్య‌ద‌ర్శి 10వ త‌ర‌గ‌తి ప‌రీక్ష ఫ‌లితాలను కొద్దిసేప టి క్రితమేవిడుద‌ల చేశారు. ఈ ఫ‌లితాల్లో కూడా బాలిక‌ల‌దే పైచేయిగా ఉంది.

టెన్త్ ఫ‌లితాల్లో 91.31 శాతం ఉత్తీర్ణ‌త సాధించారు. 3927 స్కూళ్ల‌లో వంద‌ శాతం ఫ‌లితాలు సాధిం చారు. 99శాతం ఫ‌లితాల‌ తో నిర్మ‌ల్ జిల్లా టాప్ ప్లేస్ లో ఉంది...

నిజంనిప్పులాంటిది

Apr 30 2024, 11:32

నేడు తెలంగాణలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన

లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో భాగంగా ఇవాళ ప్ర‌ధాని మోదీ తెలంగాణ‌లో ప‌ర్య‌టించ‌ను న్నారు. 

బీజేపీ జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్, మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి రఘునందన్ రావుకు మద్దతుగా ప్రచారం నిర్వహించనున్నారు. 

నేటి మధ్యాహ్నం అల్లాదు ర్గ్‌లోని ఐవీ చౌరస్తా వద్ద జరగనున్న జహీరాబా ద్-మెదక్ జనసభలోనూ ముఖ్య అతిథిగా ప్రధాని పాల్గొని ప్రసంగించను న్నారు.

ప్రధాని మోడీ సాయంత్రం హెలికాప్టర్ ద్వారా జహీరా బాద్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి జహీరాబా ద్-మెదక్ జనసభ ప్రాంగణా నికి చేరుకుంటారు. 

అనంత‌రం పబ్లిక్ మీటింగ్‌ లో ప్రసంగిస్తారు. సభ అనంతరం జహీరాబాద్ నుంచి దుండిగల్ విమానా శ్రయానికి చేరుకుని అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తిరుగుపయమవ్వ నున్నారు.

నిజంనిప్పులాంటిది

Apr 30 2024, 11:31

నేడు సీఎం రేవంత్ రెడ్డి కరీంనగర్‌, వరంగల్, చేవెళ్లలలో ఎన్నికల ప్రచారం

లోక్‌సభ ఎన్నికల ప్రచారం లో భాగంగా ఇవాళ కరీంనగర్‌, వరంగల్, చేవెళ్ల లోకసభ నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. 

మధ్యాహ్నం హుజూరాబాద్ జనజాతర సభకు సీఎం హాజరవుతారు.అనంతరం సాయంత్రం 4 గంటలకు భూపాలపల్లి జనజాతర సభలో పాల్గొంటారని పీసీసీ వర్గాలు వెల్లడించాయి. 

అలాగే రాత్రి 7 గంటలకు చేవెళ్ల లోక్‌సభ నియోజ కవర్గం పరిధిలోని మహేశ్వ రం నియోజకవర్గంలో బాలాపూర్, బడంగ్ పేట్ కార్నర్ సమావేశాలల్లో సీఎం రేవంత్‌ రెడ్డి పాల్గొని ప్రసంగిస్తారు. 

రాత్రి 9 గంటలకు ఆర్కేపు రం, సరూర్ నగర్ కార్నర్ సమావేశాలల్లో హాజరవు తారని వివరించారు...

నిజంనిప్పులాంటిది

Apr 29 2024, 19:21

లగ్గాలకు ఇక మూడు నెలలు ముహూర్తాలు లేనట్లే

మూఢాలు, ఆషాఢం కారణంగా వచ్చే మూడు మాసాలు ముహూర్తాలు లేవంటున్న వేద పండితులు

పెళ్లిళ్లు సహా ఇతర శుభకార్యాలు నిర్వహించడం కుదరదని వెల్లడి

చిరువ్యాపారుల ఉపాధికి గండి, తగ్గనున్న పెళ్లిళ్ల షాపింగ్స్ సేల్స్

సాధారణంగా ఎండా కాలంలో శుభకార్యాలు ఎక్కువగా జరుగుతుం టాయి. కానీ ఈసారి మాత్రం పెళ్లిళ్లు సహా ఇతర శుభ కార్యక్రమాలకు అనూహ్యంగా బ్రేక్ పడనుంది.

వచ్చే మూడు నెలలపాటు శుభ ముహూర్తాలు ఏమీ లేకపోవడమే అందుకు కారణమని వేద పండితులు అంటున్నారు.ఈ నెల 29 నుంచి మూడు నెలలపాటు వైశాఖ, జ్యేష్ట, ఆషాఢ మాసాల్లో గురు, శుక్ర మౌఢ్యమి వల్ల సుముహూ ర్తాలు ఉండవని వివరిస్తు న్నారు.

దీనివల్ల వివాహాలతోపాటు నూతన గృహ ప్రవేశాలు, దేవతా విగ్రహ ప్రతిష్టాప నలు, శంకుస్థాపనల లాంటి శుభకార్యాలను జరపడం సాధ్యంకాదని తెలియజే స్తున్నారు.

సూర్య కాంతి గురు గ్రహంపై పడినప్పుడు గురు మౌఢ్యమి, శుక్ర గ్రహంపై పడితే శుక్ర మౌఢ్యమి సంక్రమిస్తుందని వేద పండితులు అంటున్నారు. ఫలితంగా ఆయా గ్రహాల గమనం తెలియక శుభ ముహూర్తాలు పెట్టడం కుదరదని పేర్కొంటున్నారు.

వేద పండితులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 28 చైత్ర బహుళ చవితి ఆదివారం నుంచి జులై 8 ఆషాఢ శుద్ధ తదియ సోమవారం వరకు శుక్ర పౌఢ్యమి ఉంది.

అలాగే గురు పౌఢ్యమి మే 7 చైత్ర బహుళ చతుర్దశి మంగళవారం నుంచి జూన్‌ 7 జ్యేష్ఠ శుక్ల పాడ్యమి గురువారం వరకు కొనసాగ నుంది.గురు, శుక్ర మూఢా ల్లో నూతన శుభకార్యక్ర మాలు చేయడం మంచిది కాదని పండితులు సూచిస్తు న్నారు.

ఇక జులై 6 నుంచి ఆగస్టు 4 వరకు ఆషాఢ మాసం ఉండటంతో ఎలాగూ పెళ్లిళ్లు సహా ఇతర శుభకార్యాలు నిర్వహించడం సాధ్యం కాదని స్పష్టం చేశారు.

మూఢాలు, ఆషాడ మాసం వల్ల శుభకార్యాలకు బ్రేక్ పడటం పూలు, పండ్లు లాంటివి అమ్ముతూ జీవనం సాగించే చిరువ్యాపారుల ఉపాధిపై ప్రభావం చూప నుంది. వారి వ్యాపారం మందగించ నుంది.

అలాగే బాజాభజంత్రీలు, డప్పు వాయిద్యాలు, డీజే లు, బారాత్ లు నిర్వహించే కళాకారుల ఉపాధికి మూడు నెలలపాటు గండిపడనుంది. నూతన వస్త్రాలు, బంగారు ఆభ రణాల కొనుగోళ్లు మందగిం చనున్నాయి.

నిజంనిప్పులాంటిది

Apr 29 2024, 18:32

మూడు విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు..

దేశంలో బాంబు బెదిరిం పులు కలకలం సృష్టిస్తున్నా యి. ఇవాళ దేశంలోని పలు ప్రధాన ఎయిర్‌పోర్ట్స్‌కు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో రంగంలోకి దిగిన అధికారులు ఆయా విమానాశ్రయాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.

సోమవారం ఉదయం రాజ స్థాన్‌లోని జైపూర్, మహారా ష్ట్రలోని నాగ్‌పూర్‌ ‌, గోవా విమానాశ్రయాలకు ఈమె యిల్స్‌ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

దీంతో వెంటనే ఆయా విమా నాశ్రయాల అధికారులు స్థానిక పోలీసులకు సమా చారం అందించారు. రంగం లోకి దిగిన అధికారులు బాంబ్‌ స్క్వాడ్‌, జాగిలాలతో ఆయా విమానాశ్రయాల్లో తనిఖీలు చేపట్టారు.

అయితే, ఎక్కడా ఎలాంటి పేలుడు పదార్థాలు కనిపిం చలేదని పోలీసులు పేర్కొన్నారు. మరోవైపు బెదిరింపు మెయిల్స్‌ నేప థ్యంలో ఆయా విమానాశ్ర యాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఈమె యిల్‌ పంపిన వారి కోసం గాలిస్తున్నారు. అయితే, ఆయా విమానాశ్రయాల్లో విమాన సర్వీసులకు ఎలాంటి అంతరాయం కలగలేదని అధికారులు తెలిపారు.

కాగా, దేశంలో ఇటీవలే వరుస బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ సహా చెన్నై, ముంబైలోని పలు పాఠశాలలకు వరుస బాంబు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. అంతేకాదు, పలు విమానా శ్రయాలకు కూడా ఇలాంటి బెదిరింపులే వచ్చాయి.

ఇలా దేశంలోని పలు పాఠశాలలు, ప్రముఖ సంస్థలకు ఒకదాని తర్వాత ఒకటి వరుస బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపుతోంది.

నిజంనిప్పులాంటిది

Apr 29 2024, 18:31

సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీ

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసు లు నోటీసులు జారీ చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫేక్ వీడియోపై వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.

మే 1వ తేదీకల్లా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. రిజర్వేషన్ల అంశం మీద అమిత్ షాపై కాంగ్రెస్ నేతలే ఫేక్ వీడియోను క్రియేట్ చేశారని బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు.

దీంతో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు. రిజర్వేషన్లు రద్దు చేస్తున్నా రని అమిత్ షా చెప్పినట్లు గా ఓ ఫేక్ వీడియోను కాంగ్రెస్ పార్టీ వైరల్ చేస్తోం దని ఢిల్లీ, హైదరాబాద్‌తో పాటు పలురాష్ట్రాల్లో బీజేపీ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

దీంతో ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు కేసు నమోదు చేసి రేవంత్ రెడ్డికి సమన్లు జారీ చేశారు.

నిజంనిప్పులాంటిది

Apr 29 2024, 18:29

నేటితో ముగియనున్న నామినేషన్ల ఉపసంహరణ గడువు

లోక్‌సభ ఎన్నికలకు మరి కొన్ని గంటల్లో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియనుంది. రాష్ట్రం లోని 17 లోక్‌సభ స్థానాలకు 893 మంది నామినేషన్లు దాఖలు చేశారు.

వారిలో 271 మంది అభ్య ర్థుల నామినేషన్లను అధికా రులు తిరస్కరించారు. మిగిలిన 622 మంది అభ్యర్థుల నామినేషన్లను ఆమెదించారు. ఏప్రిల్ 26న నామినేషన్లను పరిశీలిం చారు.

మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల ఉపసంహరణ ముగుస్తుంది. అనంతరం పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాలను ఎన్నికల సంఘం ప్రకటించనుంది. అత్యధికంగా మల్కాజ్‌గిరి నియోజకవర్గం పరిధిలో 114 నామినేషన్లు దాఖల య్యాయి.

ఆ తర్వాత చేవెళ్లలో 66 మంది, పెద్దపల్లిలో 63 మంది, భువనగిరిలో 61 మంది, సికింద్రాబాద్‌, హైదరాబాద్‌లలో చెరో 57 మంది, నల్లగొండలో 56, మెదక్‌ 54, కరీంనగర్‌ 53, వరంగల్‌ 58, ఖమ్మం 45, మహబూబ్‌నగర్‌ 42, నిజామాబాద్‌ 42, జహీరాబాద్‌ 40, నాగర్‌ కర్నూల్‌ 34, మహబూ బాబాద్‌ 30, ఆదిలాబాద్‌లో 23 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు.

ఇక సికింద్రాబాద్‌ కంటోన్మెం ట్‌ ఉపఎన్నికకు 24 మంది అభ్యర్థులు 50 సెట్ల నామి నేషన్లు దాఖలు చేశారు. అందులో 21 మంది నామినేషన్లను అధికారులు ఆమోదించారు.

మే 13న పోలింగ్‌ నిర్వహిం చనున్నారు. జూన్‌ 4న ఓట్లను లెక్కించి ఫలితా లను ప్రకటిస్తారు..

నిజంనిప్పులాంటిది

Apr 29 2024, 15:21

శంషాబాద్ ఎయిర్ ఫోర్ట్ లో ఆపరేషన్ చిరుత

శంషాబాద్ ఎయిర్‌పోర్టు రన్‌వేపై చిరుత కలకలం సృష్టించింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ఎయిర్‌పోర్టు పరిసరాల్లో హై అలర్ట్ ప్రకటించారు.

చిరుతను బంధించేందుకు మొత్తం 9 ట్రాప్ కెమెరాలతో పాటుగా ఒక బోన్‌ను సైతం ఏర్పాటు చేశారు. అయితే ఆ ట్రాప్ కెమెరాల్లో సైతం చిరుత కదలికలు స్పష్టంగా రికార్ట్ అయ్యాయి.

అదే చిరుత రన్‌వే పైకి వచ్చిందని జిల్లా అటవీ శాఖ అధికారి విజయానంద్ తెలిపారు. కొన్ని నెలల క్రితం షాద్‌నగర్ ప్రాంతంలోనూ చిరుత కనిపించింది.

ఇప్పుడే అదే చిరుత ఎయిర్‌పోర్టు పరిసరాలకు వచ్చి ఉంటుందని ఎయిర్‌ పోర్టు అధికారులు భావిస్తు న్నారు. చిరుతను బంధిం చేందుకు అందులో ఓ మేకను సైతం ఎరగా ఉంచినట్లుగా డీఎఫ్‌వో విజయానంద్ వెల్లడిం చారు...

నిజంనిప్పులాంటిది

Apr 29 2024, 15:20

పులివెందులలో వైయస్ భారతి ప్రచారం

పులివెందుల నియోజక వర్గంలో సీఎం జగన్ సతీమణి భారతి రెండో రోజు వేంపల్లిలో ప్రచారం చేస్తున్నారు.

మొదటిరోజు తొండూరు మండలం ఇడమడక గ్రామంలో వైఎస్ అవినాష్ రెడ్డి సతీమణి సమతతో కలిసి ప్రచారం చేశారు. రెండవ రోజు వేంపల్లి పట్టణంలో ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తున్నారు.

వైఎస్ భారతికి శాసన మండలి మాజీ డిప్యూటీ ఛైర్మన్ సతీష్ రెడ్డి సతీమణి సుమతీరెడ్డి ఘన స్వాగతం పలికారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటేసి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థు లను తప్పనిసరిగా భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

వేంపల్లి పట్టణంలో అడుగ డుగునా భారతిరెడ్డికి స్వాగతం పలికారు. జగన్ అభిమానులు, వైసీపీ కాంగ్రెస్ కార్యకర్తలు ప్రచారంలో పాల్గొన్నారు.